Sponsered By:

Monday, December 13, 2010

కృష్ణా జిల్లా రాజకీయాల్లో జగన్మోహనాస్త్రం: నేతల్లో కలకలం!!! (Krishna Dist | Jagan | KKR | Perni Naani | Political news | Lagadapati)

కృష్ణా జిల్లా రాజకీయాల్లో కలకలం మొదలైంది. ఈ జిల్లాలో వర్షబాధిత రైతులను పరామర్శించేందుకు కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటనతో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. జగన్‌తో బందరు ఎమ్మెల్యే పేర్ని నాని సమావేశమై మంతనాలు జరిపారు. తాను జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తన అనుచరులతో ఆయన భేటీ అయ్యారు. దీంతో కృష్ణా జిల్లా రాజకీయాలు ఒక్కరోజులోనే వేడెక్కిపోయాయి. 

మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఎఫెక్టు ఆయన సొంత జిల్లా కడపలో కన్నా వేరే జిల్లాలోనే కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో దాదాపు కాంగ్రెస్ మొత్తం జగన్ వెంబడి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఈ రోజు ఉదయం బందరు శాసనసభ్యుడు పేర్ని నాని మొదట బాంబు పేల్చాడు. తాను జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమవుతున్నానని చెప్పాడు. తన అనుచరులతో భేటీ అయ్యానని వారంతా జగన్‌తో వెళ్లేందుకు తనపై ఒత్తిడి తీసుకు వస్తున్నారని చెప్పారు. తన అనుచరవర్గం చెప్పినట్టు నడుచుకోవాలని తాను నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 

పేర్ని నానిని ఆదర్శంగా తీసుకున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా జగన్ వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. వీరితో పాటు.. జగ్గయ్యపేట, నూజివీడు, మైలవరం, విజయవాడ పశ్చిమం మాజీ శాసనసభ్యులు ఉదయభాను, తాటి వెంకట ప్రతాప్ అప్పారావు, జ్యేష్ట రమేష్, జలీల్ ఖాన్, విజయవాడ మాజీ మేయర్ తాటి శకుంతల తదితరులు ఉన్నారు. 

అంతేకాకుండా, మాజీ మున్సిపల్ ఛైర్మన్లు, జెడ్పీటీసీ సభ్యుడు నాగేశ్వరరావుపై కూడా జగన్మోహనాస్త్రం పని చేసింది. గతంలో పెడన శాసనసభ్యుడు జోగి రమేష్ ఒక్కడే జగన్ వెంట వెళతారని ఇప్పటి వరకు అందరూ భావించారు. అయితే, ఆయన వెనక్కి తగ్గగా, అనూహ్యంగా కొత్త ఎమ్మెల్యేలు ముందుకు రావడం గమనార్హం. 

వాస్తవానికి పేర్ని నాని శనివారం సాయంత్రం వరకు నిజమైన కాంగ్రెస్ కార్యకర్తగా మంచిపేరుంది. అయితే, కృష్ణా జిల్లాలో జగన్ అడుగుపెట్టగానే.. జగన్ వెంట వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రాత్రికి రాత్రి చోటుచేసుకున్న హఠాత్పరిణామంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేకేఆర్ తక్షణం జిల్లాలోని సీనియర్ నేతలైన లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణులకు ఫోన్ చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. 

అంతేకాకుండా పేర్ని నానితో కూడా కాంగ్రెస్ పెద్దలు మాట్లాడినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. జగన్ వైపే మొగ్గు చూపుతానని తేల్చిచెప్పారు. తాను జగన్ వెంట వెళ్లడానికి పదవులనో డబ్బులనో ఆశించి వెళ్లడం లేదని చెప్పారు. తన అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకే వెళుతున్నట్టు తెలిపారు. అయితే, మంత్రి పదవి ఇవ్వనందుకే నాని జగన్ వెంట వెళ్లడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రకటనలో కృష్ణా రాజకీయాలు ఒక్కసారి మారిపోయా

జిల్లాల వారీగా వైఎస్.జగన్మోహన్ "ఆకర్ష్ పథకం" అమలు!!! (YS Jaganmohan | Krishna dist | Akarsh | Congress | Regional)

File
FILE
కడప మాజీ ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి "ఆకర్ష్ పథకాన్ని" జిల్లాల వారీగా అత్యంత రహస్యంగా అమలు చేస్తున్నారు. రైతుల పరామర్శ పేరుతో కృష్ణా జిల్లాలో జగన్ చేపట్టిన తొలి పర్యటనే కాంగ్రెస్‌లో కలకలం రేపింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని జగన్ మాయలో పడిన నేతలు బుజ్జగించాల్సి వచ్చింది. ముఖ్యంగా, జగన్‌ ప్రభావం ఉండదని భావించిన నేతలు తమ అభిప్రాయాన్ని మార్చుకోక తప్పలేదు. దీంతో కాంగ్రెస్ పెద్దలు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జగన్ అనుచరులుగా ముద్రపడిన వారికి ఏదో ఒకటి ఎర వేస్తూ బుజ్జగిస్తూ వచ్చారు. అయితే వీరు కాకుండా కొత్త ఎమ్మెల్యేలు, నేతలు జగన్ ట్రాప్‌లో పడటంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. 

తన తండ్రి ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తనకు లేదని పదేపదే చెపుతున్నప్పటికీ.. ఆయన మాటలు... చేష్టలు.. వ్యవహారశైలి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. 2011లో జరిగేవి సెమీ ఫైనల్స్‌గానూ, 2014 ఫైనల్స్‌ జరిగే ఎన్నికలు ఫైనల్స్‌గా పోల్చిన జగన్.. ఈ ముందుగానే తాను నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. 

ఇందుకోసం జగన్‌కు కుడిభుజంలా వ్యవహరిస్తున్న బంధువు వైవీ.సుబ్బారెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి, తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అమలాపురం ఎంపీ సబ్బం హరి, నెల్లూరు ఎంపీ మేకపాటి రామోహన్ రెడ్డి, అంబటి రాంబాబులు ఇలా ఒక్కో జిల్లాలో ఒకరు లేదా ఇద్దరు కీలక నాయకులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. 

వీరంతా ఇటు కాంగ్రెస్‌తో పాటు.. అటు ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తన వైపు రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న నేతలతో జగన్ స్వయంగా ఫోనులో మంతనాలు జరుపుతున్నారు. అందువల్లే కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ఇదేవిధంగా హైదరాబాద్‌లో దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి కుమారుడు, శాసనసభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డితో జగన్ అనుచరులు నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. తన పట్ల పార్టీ అనుసరిస్తున్న వైఖరి, పార్టీ నేతలెవ్వరూ తనను పట్టించుకోక పోవడంతో తీవ్ర అసంతృప్తికిలోనై గుర్రుగా ఉన్న ఈ యువనేత జగన్ వైపుకు మొగ్గు చూపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

ఇకపోతే.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సొంత జిల్లా చిత్తూరులో ఆపరేషన్ ఆకర్ష్ పథకాన్ని మరింత పక్బంధీగా అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు స్వీకరించగా, మంత్రి పదవి దక్కని సీనియర్ నేతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కుతూహలమ్మలు తమ వంతు సహకారం అందిస్తున్నట్టు సమాచారం. 

అలాగే, విశాఖపట్నం జిల్లాలో ఎంపీ సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైవీ.సుబ్బారెడ్డి సమావేశమై జగన్ ఓదార్పు యాత్ర షెడ్యూల్‌ను ఖరారు చేయడం గమనార్హం. ఇలా జిల్లాల వారీగా వైఎస్ జగన్ ఆకర్ష్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా.. జగన్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తూ ముఖ్యమంత్రితో పాటు అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. 

ప్రజాకర్షణ, స్థానికంగా పట్టున్న నేతలను జగన్ తన వైపుకు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పైపెచ్చు.. రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. తాము అమలు చేస్తున్న వ్యూహంలో ఎక్కడా తప్పుదొర్లకుండా అత్యంత జాగ్రత్త వహిస్తూ జగన్ వర్గం ముందుకు పోతోంది. అయితే ఈ పరిస్థితిని వారించేందుకు కాంగ్రెస్ నేతల్లో ఏ ఒక్కరూ చొరవ తీసుకోక పోవడం గమనార్హం.

బాధపడొద్దు బాబాయ్... ఇదిగో నా పారితోషికం... (Ramcharan | Orange | Nagababu)

WD
ఆరెంజ్ సూపర్ ప్లాప్‌తో నిర్మాత నాగబాబు తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యాడు. మొన్నీమధ్య మిరపకాయ్ ఆడియో ఫంక్షన్లో ఆరెంజ్ దర్శకునిపై పరోక్షంగా విరుచుకపడ్డాడు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మాత సినిమా తీస్తుంటే, దాన్ని సీరియస్‌గా తీసుకోని కొందరు దర్శకులు నిర్మాతలను పురుగుల్లా పీల్చి పిప్పి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

బాబాయ్ ఆవేదనను అబ్బాయ్ అర్థం చేసుకున్నాడో ఏమోగానీ, రాంచరణ్ ఆరెంజ్ సినిమాకోసం తీసుకున్న పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశాడట. బాధపడకు బాబాయ్... నిర్మాత దెబ్బతిన్నప్పుడు నటీనటులు తప్పక ఆదుకోవాలని తన మాటగా చెప్పాడట.